ప్రత్త్యేక తెలంగాణా వస్తుందా ? అంటూ నమస్తే గురు చెప్పి 24 గంటలు గడవకముందే జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించే నివేదిక తెలంగాణకు అనుకూలంగా ఉండదనే విసయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు.
జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించే నివేదికలో తెలంగాణకు అనుకూలంగా ఏమీ ఉండదనే విషయాన్ని ఆ కమిటీ సభ్యకార్యదర్శి వీకేదుగ్గలే స్వయంగా తనకు చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. శ్రీకృష్ణ కమిటీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ఈ విషయాన్ని దుగ్గల్ స్వయంగా తనకు చెప్పారన్నారు. కమిటీ నివేదికలో సమైక్యాంధ్రగా ఉంచాలని మాత్రమే ఇవ్వనున్నట్టు చెప్పారని కేసీఆర్ వెల్లడించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి